Total Pageviews

Tuesday, July 5, 2016

స్వప్న దర్శనంలో విభూతిని తినమని బాబా అతనికి చెప్పారు

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
1942 జూన్ మాసం లో గూటికి చెందిన న్యాయవాది ఎస్. సుబ్బారావు తరచు విపరీతంగా తల తిరిగేది. ఈ కారణం చేత ఎక్కడైనా ఎప్పుడైనా పడిపోయే పరిస్థితి ఏర్ఫడింది. అరవై ఆరు సంవత్సరాల వయసులో ఇలా జరగడం వలన బయటకు వెడితే పడిపోతారేమొనని భయపడాల్సివచ్చింది. కర్రపట్టుకుని నడిచే ప్రయత్నం చేద్దామనుకున్నారు, కానీ అదికూడా రెండుమూడు సార్లు కర్రవున్నా రోడ్డుమీద పడడంతో పనిచెయలేదు. దాంతో సుబ్బారావు తను ఇంటికే పరిమితం అయిపోవాల్సివస్తుందని భయపడ్దారు. పరిస్థితి 1946 జూలై 4 నాటి రాత్రికి విషమించింది. అతను ఇంట్లో పడుకునివుండగా విపరీతంగా తలతిప్పింది. తను బయటకు పోవడానికి భయపడుతూ వుండడంతో బాబా ను మనస్పూర్తిగా ప్రార్దించాడు,
తెల్లవారుఝామున బాబా స్వప్న దర్శనమిచ్చారు. బాబా న్యాయమూర్తిగా ఒక ఎత్తైన ఆసనం మీద కూర్చుని వుంటే సుబ్బారావు ఆయన ముందు నిలబడి వున్నాడు. బాబా సుబ్బారావుకి ఒక పెద్ద విభూతి ప్యాకెట్టు ఇచ్చి దానిని పెద్ద సంఖ్యలో తినమన్నారు. ఆ తరువాత సుబ్బారావు ఇంటికి తిరిగి వస్తూండగా ఒకభక్తుడు అతనికి ఒక చిన్న విభూతి పొట్లం ఇచ్చాడు. ఆ విభూతి పొట్లాన్ని ఆ భక్తుడు సుబ్బారావు పై జేబులో పెట్టాడు. సుబ్బారావుకి ఈ స్వప్నం వలన అర్దం అయినదేమిటంటే విభూతి ని అత్యధికంగా వాడితే తన తలతిప్పువ్యాధి తొలగిపోతుందని. అప్పటినుండి తన జేబులో చిన్న విభూతి పొట్లాన్ని సుబ్బారావు వుంచుకునేవాడు. సుబ్బారావు కోలుకున్నాడు తన పనులకి హాజరవసాగాడు.
సాయ సుధ, సంపుటి:7, భాగం: 4, సెప్టెంబరు 1946.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374

0 comments:

Post a Comment